"పదునాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు" పదునాలుగు లోకాలలో..! మొదటి మూడు లోకాలను అంటే భూలోకం , భువర్లోకం, సువర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లోకాల్లో ను ఉంటారు.

"పదునాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు"

 పదునాలుగు లోకాలలో..!

మొదటి మూడు లోకాలను అంటే భూలోకం , భువర్లోకం, సువర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లోకాల్లో ను ఉంటారు.
 
 నాలుగవదైన మహర్లోకం 
కల్పాన్తములో కూడా నశించదు. ఈ లోకంలొ కల్పాంత జీవులు ఉంటారు.

 అయిదవది అయిన జనలోకంలో
బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

 ఆరవదైన తపోలోకంలో 
దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటారు.

 ఏడవ లోకం మరియు ఊర్ధ్వ లోకములలో ఆఖరుది అయిన సత్యలోకం మరణ ధర్మం లేని పుణ్య లోకం.
ఇందులో సిద్ధాది మునులు నివసిస్తారు.

 ఎనిమిదవ లోకం అయిన అతలంలో మయదానవుని సంతతికి చెందిన అసురులు నివశిస్తారు.

 తొమ్మిదవది అయిన వితలం లో హోటకేస్వరుడు మరియు ఆయన పరివారం ఉంటారు.

 పదవది అయిన సుతలం లో బలిచక్రవర్తి , అతని అనుయాయులు నివశిస్తూ ఉంటారు.

 పదకొండవది అయిన తలాతలం లో త్రిపురాధిపతి అయిన యమధర్మ రాజు  మహాదేవ రక్షితుడై ఉంటాడు.

 పన్నెండవది అయిన మహాతలం లో 
కద్రువ సంతతి వారైన నానా శిరస్సులు గల కాద్రవేయులు ఉంటారు. వీరిలో తక్షకుడు, కాలుడు, సుషేణుడు మొదలైనవారు ఉన్నారు .

 పదమూడవది అయిన రసాతలం లో
"పణి " అనబడే దైత్యులు , రాక్షసులు నివశిస్తూ ఉంటారు. నిరత కవచులు, కాలేయులు, హిరణ్య పురవాసులు వీరే .

 పదునాలుగవది అయిన పాతాళ లోకం లో 
 శంఖుడు, మహాశంఖుడు, శ్వేతుడు , ధనంజయుడు, శంఖచూడుడు, కంబలుడు, ధృతరాష్ట్రుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలయిన సర్వజాతుల వారు నివశిస్తూ ఉంటారు.

Post a Comment

0 Comments